టాలీవుడ్ లో ప్రభాస్ కి బాహుబలి తర్వాత విపరీతమైన క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే.  ఒక్క మన దేశంలోనే కాక ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయిలో విడుదల అవుతున్నాయి. అంతలా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ సినిమాకు గాను ప్రభాస్ అయిదు సంవత్సరాలు కష్టపడి విజయం సాధించాడు. ఇలా సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటే భారి విజయం సాధించవచ్చని ప్రభాస్ ఆలోచన గా రూమర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రభాస్ అభిమానులకు ఈ మధ్య ఒక వార్త చిరాకు కలిగిస్తుంది.

 

బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు చేయనని 100 కోట్ల బడ్జెట్ కి మించి ఉండకుండా జాగ్రత్త పడతానని మీడియా ముఖంగా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ చేస్తున్న సినిమాల లెక్కలు చూస్తుంటే ప్రభాస్ మాట తప్పినట్టు అర్థమవుతుంది. అంతేకాక ఇక నుండి తీసే సినిమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని చెప్పాడు. కాని సాహో సినిమాకు చాలా టైం తీసుకున్నారు. ఇక దాని తర్వాత సైన్ చేసిన సినిమాలు ఇప్పటి వరకు టైటిల్స్ కూడా చెప్పలేదు. ఈ విషయమై కూడా అభిమానుల్లో ఒకింత అసహనం వ్యక్తమవుతుంది. 

 

కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్ లు వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభాస్ కొత్త సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఇది 2022 కాని రిలీజ్ అవ్వదని సినీ  జనాల చర్చ. అంటే ప్రభాస్ అభిమానులకు 2021 లో ఒక్క సినిమా కూడా లేదన్న మాట. దీని తో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ తన 21 వ సినిమా నాగ అశ్విన్ తో చేయాల్సి ఉంది. ఈ సినిమాకు మరో రెండేళ్ల సమయం పడుతుందని ఇండస్ట్రీ టాక్. మరి ప్రభాస్ తన అభిమానుల ఆగ్రహాన్ని ఎలా తగ్గిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: