టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంభినేషన్ లు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోతాయి. అందుకే ఆ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి కాంభో లు మన తెలుగు ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరై, మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్న బాలయ్య, బోయపాటిల కాంభి నేషన్. వీరి కాంభోలో వచ్చిన సింహా, లెజెండ్ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వీరి కామ్భినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. 

 

బోయపాటి శ్రీను మాస్ ప్రేక్షకుల మనసు గెలవటానికి మరొక సారి రెడీ అయ్యారు అని సిని వర్గాల కథనం. బాలకృష్ణ హీరోగా మంచి కమర్షియల్ హంగులతో ఒక సినిమా తెర పైకి తీసుకురానున్నారు. అయితే కొన్ని సన్నివేశాలు విదేశాల్లో షూటింగ్ జరపాల్సి ఉండగా కరోనా దెబ్బ తగిలింది. ఈ పరిస్థితుల్లో సిటీ బయటికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దీని తో బడ్జెట్ విషయంలో నిర్మాత కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచారం. దీని వల్ల బోయపాటికి, నిర్మాతకి కొంచెం మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చేసేది లేక ఇక్కడే భారీ సెట్టింగ్స్ వేసి  ఆ సన్నివేశాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.

 

అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కనుక అంత బడ్జెట్ పెట్టడానికి సదరు నిర్మాత సుముఖంగా లేకపోవడం తో బోయపాటికి  రెండో సారి గట్టి దెబ్బ తగిలింది. వీటన్నిటిని బాలయ్య గురించి ఆలోచించి బోయపాటి లైట్ తీసుకున్నారు. అయితే ఆ నిర్మాత ఎవరనేది తెలియదు. ఇక పోతే ఎన్ని వడి దుడుకులు వచ్చినా వీరి సినిమా పై ప్రేక్షకులకు అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక కథ విషయానికి వస్తే గతంలో వచ్చిన సింహా, లెజెండ్ మాదిరిగానే యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. అయితే దీని గురించిన  సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: