సీనియర్ డైరెక్టర్లు, కాస్తా ముందు చూపు ఉన్న వారంతా కూడా ఇపుడు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. వారు. రేపటి బొమ్మను నేడే  చూస్తున్నారు. రేపు ఎలా ఉంటుందో కూడా బాగానే ఊహిస్తున్నారు. అందువల్ల వారి ఇంకా అడ్వాన్స్ అవుతున్నారు. ఆ విధంగా వినూతమైన కార్యచరణతో ముందుకు వస్తున్నారు.

 

అలా వస్తున్న వారిలో సీనియర్ డైరెక్టర్ వంశీ కూడా ఉన్నారు. ఆయన చూపు ఇపుడు వెబ్ సిరీస్ మీద పడిందని అంటున్నారు. వంశీ అనగానే మొదట గుర్తుకువచ్చే సినిమా లేడీస్ టైలర్. ఈ మూవీ 80 దశకంలో ఎంతటి సంచల విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో పాటలు, మాటలూ జనం నోళ్ళలో బాగా నానాయి.

 

ఇక ప్రేమించూ‍.. పెళ్లాడు అన్న మూవీతో వంశీ టాప్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన సినిమాలు తెలుగు అందాలను, గోదారమ్మను బాగా చూపిస్తాయి. ఆయన భావుకుడు. అందుకే వెండి తెర మీద కూడా అందమైన ద్రుశ్యాలను గీస్తాడు. కవితలను అల్లుతాడు. అయితే జనరేషన్ మారడంతో  వంశీ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

 

అయితే ఇపుడు వెబ్ మీడియా రోజులు కాబట్టి వంశీ మళ్ళీ తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు. వంశీ తాను స్వయంగా రచయిత కావడం వల్ల ఆయన స్వగతంలా రాసుకున్న పొలమారుతున్న జ్ణాపకాలును ఇపుదు వెబ్ సీరీస్  గా తీసుకురావాలనుకుంటున్నారుట. ఈ వెబ్ సిరీస్ ని ఓటీటీ టేకప్ చేసి వంశీకి భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

 

మొత్తానికి వంశీ బొమ్మలను  ఇకపైన స్మార్ట్ ఫోన్లోనూ చూసేయవచ్చు అన్న మాట. ఓ విధంగా వంశీ మూవీస్ కి కనెక్ట్ అయిన వారు ఇపుడు కూడా ఉన్నారు. ఆ జనరేషన్ కి ఇపుడు వంశీ వెబ్ ఫీల్డ్ లో అడుగుపెట్టడం శుభవార్తగానే చూస్తారు. సో గ్రాండ్ వెల్ కం వంశీకి అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: