టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు విజయాలు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక వీటి అనంతరం వంశీ పైడిపల్లితో ఒక సినిమాని మహేష్ ప్రారంభించాల్సి ఉండగా, ఆ సినిమా కథా కథనాలు పూర్తిగా సిద్ధం కాకపోవడంతో తన నెక్స్ట్ సినిమా అవకాశాన్ని గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కి అందించారు మహేష్. 

 

ఇటీవల ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ ని మహేష్ బాబు వినిపించిన పరుశురాం, అతి త్వరలో దాన్ని పట్టాలెక్కించనున్నారు. లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ బర్త్ డే అయిన ఈనెల 31వ తేదీన ఈ సినిమా లాంచ్ కానుందని, వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారట. అయితే ఈ సినిమా విషయమై సంగీత దర్శకుడు ఎవరిని తీసుకుంటున్నారు అనే దానిపై టాలీవుడ్ వర్గాల్లో కొద్దిరోజులుగా విపరీతంగా చర్చ జరుగుతోంది. 

 

కొందరేమో యువ సంగీత దర్శకుడు గోపీసుందర్ ని తీసుకుంటున్నారు అంటుంటే, మరికొందరేమో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ లేదా యువ సంగీత తరంగం ఎస్.ఎస్.తమన్ లను తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక కొందరు మహేష్ బాబు సన్నిహితులు నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాకు తమన్ ఆల్మోస్ట్ ఖాయం అయినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా ఈ సినిమా సంగీత దర్శకుడి ఎనౌన్స్ చేయాలని, లేకపోతే ఈ టెన్షన్ తట్టుకోలేక పోతున్నామని కొందరు నెటిజన్లు, మహేష్ బాబు అభిమానులు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: