టాలీవుడ్ చరిత్రలో కొన్ని కొన్ని సినిమాలు అలా నిలిచిపోతు ఉంటాయి. అది ఈ తరం సినిమాలు అయినా కిందటి తరం సినిమాలు అయినా సరే ప్రేక్షకులకు అలా గుర్తుండి పోయే విధంగా ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో హీరోలు మహేష్ బాబు వెంకటేష్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఒక మంచి మల్టీ స్టారర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది అనేది వాస్తవం. ఫ్యామిలీ కథ అయిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 

 

ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా కావాలి అనుకుని ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సినిమాను ఇప్పటికి అయినా దర్శక నిర్మాతలు తీసుకొచ్చే ప్లాన్ చెయ్యాలని పలువురు సూచనలు కూడా చేస్తున్నారు. అయినా సరే ఈ సినిమా తర్వాత మాత్రం అలాంటి సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు ఒక మంచి సినిమా కోసం చాలా ఎదురు చూసారు. ఇద్దరూ స్టార్ హీరోలు అయినా సరే ఏ మాత్రం సిగ్గు పడకుండా తమ స్థాయి తగ్గినా సరే కలిసి నటించారు. 

 

ఒక సీన్ లో తమకు తాము తక్కువగా కనపడినా సరే వెనకడుగు వేయలేదు. దర్శకుడి ఆలోచనను ముందుకు తీసుకుని వెళ్ళారు. వారి కెరీర్ లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. ప్రధానంగా మహేష్ బాబు కెరీర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్. అయితే ఆ తర్వాత ఇద్దరూ కూడా మళ్ళీ ఆఫర్ వచ్చినా సరే కలిసి నటించడానికి ముందుకు రాలేదు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ పరుశురంతో ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: