మెగా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒక సినిమాలో హీరోలుగా నటిస్తే చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. గతంలో ప్రముఖ నిర్మాత కళా బంధు సుబ్బిరామి రెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్టుగా ఓ వేడుకలో ప్రకటించాడు. కానీ ఆ తరువాత సినిమాకు సంబంభించి ఎలాంటి అప్ డేట్ రాలేదు.
అయితే అప్పటికే చిరు సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో ఉండటంతో చిరు, పవన్ మల్టీ స్టారర్ ఉత్తుత్తి మాటే అనుకున్నారు అంతా. దీంతో అభిమానులు కూడా పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ తరువాత చిరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించటంతో మళ్లీ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. చిరు, పవన్ ను ఒకే సినిమాలో చూసే అవకాశం ఉందని అభిమానులు సంబరపడిపోయారు. కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలువ లేదు.
చిరు రాజకీయాలకు గుడ్ బై చెప్పే లోపు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు. ఇక సినిమాలు చేయటం కష్టమే అని చెప్పేశాడు. దీంతో మెగా అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. అయితే పవన్ రాజకీయాల్లో ఫెయిల్ కావటంతో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను ప్రారంభించిన పవన్, మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. దీంతో మరోసారి మెగా మల్టీ స్టారర్ పై ఆశలు మొదలయ్యాయి. మరి ఈ సారైన ఈ క్రేజీ కాంబినేషన్ తెర మీదకు వస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఈ కాంబినేషన్ను తెర మీదకు తీసుకువచ్చేందుకు పలువురు దర్శఖులు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.