జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆర్‌.ఆర్‌.చిత్రం కోసం  ఆయ‌న ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే కరోనా కార‌ణంగా ఆ ప్రాజెక్ట్ కాస్త పెండింగ్‌లో ప‌డింది. దాంతో కాస్త నిరాశ‌లో ఉన్న ఆయ‌న ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ పై వ‌స్తున్న వార్త‌ల గురించి ఆలోచిస్తే గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. ఆర్.ఆర్‌.ఆర్‌. ఇంకా త్రివిక్ర‌మ్‌తో మూవీ చేస్తున్న విష‌యం ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాల‌ని వినికిడి. ఇక ఈ రెండు క్రేజీ ప్రాజ‌క్ట్స్ పూర్త‌వ‌గానే ప్ర‌శాంత్ నీల్ చిత్రాన్ని మొద‌లు పెడ‌తార‌ట‌. 2021 ఆఖ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. కావున ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌కి కిక్కెక్కిస్తోంది.

 

ఎన్టీఆర్ తో ప్రశాంత నీల్ ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నాడట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కానుందట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయిస్తున్నారట. దీంతో ఈ  2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నంద‌ని స‌మాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 తరువాత ప్రేక్షకుల ముందుకు రానుందని వినిపిస్తుంది. త్రివిక్రమ్ మూవీ తరువాత ఎన్టీఆర్ కి భారీ గ్యాప్ పడవచ్చు అంటున్నారు. మ‌రి అంత భారీ ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేసే ముందు ఎలాగైనా స‌రే గ్యాప్ అనేది స‌ర్వ‌సాధార‌ణం. 

 

ఇక ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా హీరోలంద‌రూ కూడా పాన్ ఇండియా సినిమాల‌కు ఎక్కువ మ‌క్కువ చూపిస్తున్నారు. మ‌రి హీరోల‌కుండే క్రేజ్‌ని బ‌ట్టి నిర్మాత‌లు కూడా బ‌డ్జెట్‌కి ఎక్క‌డా విన‌కాడ‌డం లేదు. మ‌రి ఇప్పుడు క‌రోనా కార‌ణంగా ఈ బ‌డ్జెట్ సినిమాల్లో నిర్మాత‌లు ఎక్క‌డ‌న్నా వెన‌కాడ‌తారా ఏంటి అన్న విష‌యం ఇంకా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: