ఎంత మంచి కథలున్నా ప్రొడ్యూసర్ లేనప్పుడు అసలు సినిమా అనేదే  ఉండదు. అందుకే ఈ మధ్య నచ్చిన కథలుంటే నిర్మాతల కోసం వెయిట్ చెయ్యకుండా తమకు తామే సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు స్టార్లు. అంతేకాదు వాటికోసం ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నా.. కొత్తవాటిని తెరమీదకు తెస్తున్నారు . అందుకోసం ఆల్రెడీ పెద్ద పెదప్రొడక్షన్ హౌస్ లు వాళ్ల పేరెంట్స్ కి ఉన్నా కూడా తమకు తామే సొంతగా  రెండోప్రొడక్షన్ ని స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇలా ఈమద్య సమంత, నాగచైతన్య  ప్రొడక్షన్ హౌస్  టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

 

ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీ కి అన్నపూర్ణ స్టూడియో లాంటి పెద్ద బ్యానర్ ఉండనే ఉంది.  అయితే ఈ మద్య వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సమంత.. ఈ టైప్ ఆఫ్ మేకింగ్ కి బాగా ఎట్రాక్ట్ అయ్యిందట. అందుకే సొంతగా ప్రొడక్షన్ హౌస్ పెడదామని ఆలోచనలో ఉన్నారట నాగచైతన్య, సమంత జంట. చైతూ ఈ పనిలో భాగంగా ఓ స్టోరీ కూడా విన్నట్టు..దానికి  గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు న్యూస్ నడుస్తోంది. వీళ్లతో పాటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్ సుప్రియ కూడా  ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ ఐడియాలోనే ఉందట.

 

అన్నపూర్ణ బ్యానర్ తర్వాత  మరో పెద్ద బ్యానర్‌ పద్మాలయా స్టూడియోస్. సూపర్ స్టార్ కృష్ణ ఈ బ్యానర్ లో చాలా సినిమాలు నిర్మించారు. అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్నా కూడా  మహేష్ బాబు.. తన పేరుమీద జీఎమ్బీ  ఎంటర్ టైన్ మెంట్స్ స్టార్ట్ చేసి శ్రీమంతుడు, బ్రమ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు  లాంటి సినిమాలు చేశాడు . ప్రస్తుతం అడవి శేష్ తో మేజర్ సినిమాని తెలుగు, హిందీలో మహేష్ బాబు ప్రొడక్షన్ లోనే తెరకెక్కుతోంది.


మెగాస్టార్ ఫ్యామిలీకి ఎక్స్ క్లూజివ్ గా  అంజనా ప్రొడక్షన్స్ ఉంది. నాగబాబు ప్రొడ్యూసర్ గా చిరంజీవితో రుద్రవీణ, త్రినేత్రుడు, స్టాలిన్ లాంటి చాలా సినిమాలు , రామ్ చరణ్ తో  ఆరెంజ్ సినిమాలు చేశాడు ఈ బ్యానర్ లో .  ఈ బ్యానర్  ఉండగానే.. మరో సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు చిరంజీవి, రామ్ చరణ్‌. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్ చరణ్ సైరా లాంటి భారీ సినిమా తెరకెక్కించాడు. మెగాస్టార్ తో ప్రజెంట్  ఆచార్య సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మిస్తున్నాడు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: