మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్, సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఎఫ్ 2 మూవీ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామా కాగా... ఇందులో వరుణ్ తేజ్ మెహరిన్ తో జత కట్టగా... హీరో వెంకటేశ్వర మిల్కీ బ్యూటీ తమన్నా తో రొమాన్స్ చేశాడు. హనీ ఇస్ ద బెస్ట్ అనే ముచ్చటైన మాటలతో మెహరీన్ వెండితెరపై మ్యాజిక్ చేయగా... అంతేగా అంతేగా అంటూ వెంకటేష్, వరుణ్ తేజ్ మామయ్యలు డైలాగులు చెబుతూ ఎఫ్2 మూవీ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.


2019 సంవత్సరంలో తెరకెక్కిన ఈ చిత్రం లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శిని తదితరులు కీలకమైన పాత్రలలో నటించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని రూ. 32 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించగా... బాక్సాఫీసు వద్ద దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఆ పండుగ సందర్భంగా రిలీజ్ అయిన అన్ని సినిమాలకు పోటీగా నిలిచింది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత బాణీలు అందించగా... పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తమన్నా విక్టరీ వెంకటేష్ తో కలిసి... మెహరీన్ వరుణ్ తో కలసి గిర్రా గిర్రా గిర్రా అని తిరుగుతుంది బుర్రా అనే పాటలో మస్తుగా అందాలను ఆరబోస్తూ అందరికీ కిక్కేకించారు.


ఇకపోతే f2 చిత్రం విజయవంతం అయ్యింది కాబట్టి దానికి సీక్వెల్ గా ఎఫ్3 సినిమాను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి, దిల్ రాజు భావిస్తున్నారు. ఈసారి లీడ్ రోల్ లో రవితేజ నటించనున్నాడని సమాచారం. ఏదేమైనా వెంకటేష్ వరుణ్ తేజ్ లు కలిసి వెండితెరపై తమ నటనా చాతుర్యంతో, ముచ్చటైన కాంబినేషన్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా లో నటిస్తారో లేదో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: