లాక్ డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ రకరకాలుగా గడుపుతున్నారు. కొంతమంది ఇంట్లోనే ఉంటూ సినిమా న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు గురించి కరోనా వైరస్ జాగ్రత్తలు గురించి చెబుతున్నారు. మరి కొంతమంది అయితే భార్యలకు సహాయం చేస్తూ ఇంట్లో పని వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. మరి కొంతమంది యోగా, ఇంటిలోనే జిమ్ మరియు పుస్తకాలు చదువుతూ గడుపుతున్నారు. ఇటువంటి లాక్ డౌన్ ని ప్రముఖ హీరోయిన్ కీర్తీ పాండియన్ ' ఒక రేంజ్ ' లో వాడుకుంటుంది. తన సొంత ఊరిలో పొలంలో రైతు అవతారం ఎత్తి వ్యవసాయం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె ట్రాక్టర్ తో దున్నుతున్న వీడియో మరియు వరినాట్లు నాటుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.
దీంతో కీర్తీ పాండియన్ అభిమానులు ఫొటోస్ వీడియోస్ చూసి నువ్వు సూపర్ పిల్ల అదర గొట్టావ్ అని కామెంట్ చేస్తున్నారు. అందరి రూట్ ఒకటైతే నీది సపరేటు రూట్ అంటూ కీర్తీ పాండియన్ నీ 'ఒక రేంజ్' లో పొగిడారు. సినిమా ఇండస్ట్రీలోకి ప్రముఖ నటుడు అరుణ్ పాండియన్ వారసురాలిగా 'తుంబ' అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ప్రస్తుతం విలన్ అనే మలయాళ చిత్రం తమిళ రీమేక్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో సొంతూరులో ఈ విధంగా వ్యవసాయం చేస్తూ కుటుంబ సభ్యులతో గడుపుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న హీరోయిన్లు అంతా ఒకలాగా ఎంజాయ్ చేస్తే, హీరోయిన్ కీర్తీ పాండియన్ మాత్రం లాక్ డౌన్ ని చాలా డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కువశాతం ఈమె చేసిన వీడియోలకు ఫోటోలకు జై జవాన్ జై కిసాన్ అనే కామెంట్లు నెటిజన్లు మరియు అభిమానులు పెడుతున్నారు.