టాలీవుడ్ లో అష్టా చమ్మాతో పరిచయమైన నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఆయన ఇండస్ట్రీకి రాక ముందు శ్రీను వైట్ల, బాపు గారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసారు. తర్వాత కొన్ని రోజులు రేడియో జాకీగా పనిచేశారు. అష్టా చమ్మా తర్వాత నటించిన ఈగ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. అయితే నాని కెరీర్ లో ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

 

అయితే ఈ మధ్య కాలంలో నాని కి కెరీర్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే నాని సినిమాలకు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు మాత్రం వెనుకాడటం లేదు.        అయితే ఇప్పుడు నాని ఒక పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సినీ  వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టాక్సి వాలా డైరెక్టర్ సాంక్రుత్యాన్  తో శ్యాం సింగ రాయ్ అనే టైటిల్ తో నాని ఒక సినిమా తీస్తున్నట్టు కథనం. అయితే ఈ సినిమా పై పరిశ్రమలో కొన్ని రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. 

 

శ్యాం సింగ రాయ్ సినిమా ఆగిపోయిందని వదంతులు వచ్చాయి. కాని అందులో ఎలాంటి వాస్తవం లేదని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెల్లడించింది. అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతున్నందున దీన్ని పలు భాషల్లో విడుదల చేసే విధంగా పాన్ ఇండియా మూవీ గా తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే నానిసినిమా కోసం హార్డ్ వర్కౌట్ లు చేస్తున్నారని సినీ జనాల కథనం. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నానిసినిమా కోసం సిక్స్ ప్యాక్  కోసం కష్టపడుతున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం అవుతుంది. ఈ సినిమా ద్వారా నాని ఏ రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటాడో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: