టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు ఆచార్య, ఆర్ఆర్ఆర్. ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్. ఈ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఆచార్య సినిమాను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని లేదా వచ్చే ఏడాది వేసవిలో తీసుకుని రావాలని ప్రయత్నాలు చేసినా సరే సాధ్యం అయ్యే అవకాశాలు దాదాపుగా కనపడటం లేదు కూడా. 

 

దీనితో దర్శక నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు తీవ్ర అసహనంలో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు ఈ మూడు సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాలు ఆలస్యం అయితే తమకు నష్టం అని ఏదోక విధంగా షూటింగ్ ని మొదలుపెట్టాలని నిర్మాతలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుంది అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసుకున్నాయి కూడా. 

 

ఈ సినిమాలను మళ్ళీ రీషూట్ చెయ్యాలి అని దర్శకులు కూడా భావించడం ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది అని నిర్మాతలకు ఈ ఆవేదన ఎక్కువగా ఉందని ఇదే కొనసాగితే ఇబ్బంది పడటం ఖాయమని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పద్ధతి సరైనది కాదని షూట్ చేసే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభాస్ సినిమా నిర్మాత చెప్పారట. మరి ఈ సినిమాలు రీ షూట్ జరుపుకునే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆచార్య సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఆచార్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: