బాహుబలి సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ చేసే ఏ సినిమా అయినా నేషనల్ అటెన్షన్ క్రేయేట్ చేస్తోంది. ఇందుకు ఉదాహరణగా సాహో మూవీని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా నిర్ణయించకపోవడంతో ప్రభాస్20 గా పిలుస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

 

 

దర్శకుడు రాధాకృష్ణసినిమా ప్రారంభోత్సవం సందర్భంలో తీసిన కొన్ని ఫొటోలను రిలీజ్ చేశాడు. తనతో పాటు ఈ ఫొటోల్లో ప్రభాస్, పూజ హేగ్డే, కృష్ణంరాజు, రాజమౌళి, వివి వినాయక్, వంశీ ఉన్నారు. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ ఫొటోలు పెద్దగా కిక్ ఇవ్వడంలేదని చెప్పాలి. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి అప్డేట్స్ ను, స్టిల్స్ ను రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశారు. వారి కోరిక ప్రకారం ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా సినిమా ఓపెనింగ్ ఫోటోలు రిలీజ్ చేయడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి.

 

 

ఈ ఫొటోలు గతంలోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ ఫొటోస్ చూడడం మినహా ప్రభాస్ అభిమానులకు ఎటువంటి ఆనందం లేదనే చెప్పాలి. మరి కొత్త అప్డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో యూవీ క్రియేషన్స్ చెప్పాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా సెట్స్ పై ఉంది. ప్రభాస్ గత మూవీ సాహో తెలుగులో ఫ్లాప్ అయినా బాలీవుడ్ లో డీసెంట్ కలెక్షన్లు సాధించింది. దీంతో ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా కంటెంట్ తప్పనిసరి అయింది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: