జయాపజయాలతో సంబంధం లేకుండా వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవలే చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వా ,ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించనున్న మహాసముద్రంలో కూడా నటించడానికి ఓకే చెప్పాడట. మల్టీ స్టారర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సిద్దార్థ్ మరో హీరోగా నటించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఇక ఇవే గాక శర్వానంద్ తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి చెప్పిన కథ కు శర్వా ఓకే చెప్పాడట. పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.