టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఇటీవల ఎన్నడూ లేనంత ఆనందంగా ఉన్నారు. దానికి ప్రధాన కారణం, ఆయన ఇటీవల వరుసగా మూడు సినిమాలతో విజయాలు అందుకుని హ్యాట్రిక్ నమోదు చేయడం జరిగింది. రెండేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను, ఆపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి, ఇక ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు వరుసగా సక్సెస్ లు అందుకుని సూపర్ స్టార్ ని, అలానే ఆయన ఫ్యాన్స్ ని మంచి ఖుషి చేసాయి. 

 

ఇక అతి త్వరలో మహేష్ బాబు నటించబోయే తదుపరి సినిమా ప్రారంభం కానుంది. గీత గోవిందం సినిమా దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేసి, ప్రారంభించాలని చూస్తున్నారట సినిమా యూనిట్ సభ్యులు. మహేష్ బాబు సరసన ఒక స్టార్ హీరోయిన్ నటించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు అదిరిపోయే లుక్ లో కనిపించనున్నట్లు టాక్. 

 

ఇకపోతే ఈ సినిమా తో పాటు, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో వంశీ పైడిపల్లి కూడా తన సినిమా స్టోరీని పూర్తిగా సిద్ధం చేసాడని, దానితో ఒకేసారి పరశురామ్ సినిమాతో పాటు వంశీతో చేయబోయే సినిమాలను కూడా అదే రోజున అనౌన్స్ చేయబోతున్నాడట సూపర్ స్టార్. కాగా వంశీ పైడిపల్లి సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతూ మంచి కమర్షియల్ గా ఉండనుందని అంటున్నారు. కాగా ఆ సినిమాని మహేష్, దిల్ రాజు కలిసి నిర్మించనున్నారట. అయితే పరశురామ్ తో సినిమా మాత్రం కృష్ణ గారి పుట్టినరోజున ప్రారంభం అవడం ఖాయం అని, కానీ వంశీ పైడిపల్లి సినిమా మాత్రం అదే రోజున ముహూర్తం జరుపుకుంటుందా లేదా అనే దానిపై మాత్రం అధికారికంగా సమాచారం రావాల్సి ఉందని అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకేరోజున రెండు పండుగలు వచ్చినట్లే మరి.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: