ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ది బెస్ట్ సినిమాల్లో మహానటి ఒకటి. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా మహానటి సినిమాను ఒక రేంజ్ లో ఆదరించారు. మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల ప్రసంశలు కూడా దక్కాయి. ఈ సినిమా ఆ స్థాయిలో విజయం సాధించింది అనే చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాకు కీర్తి కాకుండా మరొకరు నటిస్తే...? 

 

ఏమో ఎలా ఉంటుందో కీర్తి మినహా ఎవరూ కూడా సరిపోయే అవకాశం లేదని చాలా మంది ప్రేక్షకులు అంటారు. కాని ఆ పాత్రకు నిత్యామీనన్ కూడా సరిపోయే అవకాశం ఉంది అనేది కొందరి మాట. కీర్తి సురేష్ ఆ పాత్రలో సరిగా సరిపోయే వారట. అలాగే సాయి పల్లవి ని పరిశీలించవచ్చు అని కొందరు సూచనలు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులకు కీర్తి ఈ సినిమాతో బాగా దగ్గరైంది అని సావిత్రి పాత్రలో ఆమెనుయ్ మినహా ఎవరిని ఊహించుకునే అవకాశం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

సినిమా కీర్తి జీవితంలో ఒక స్థాయిలో నిలిచిపోయింది అనేది వాస్తవం ఆమెకు పలు అవార్డులు కూడా ఈ సినిమాకు వచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకులు కూడా ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. మరి నిత్యామీనన్ ని ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి. నిత్యా మీనన్ ఈ సినిమాకు లావు కారణంగా సరిపోయే అవకాశం లేదు అనేది కొందరి మాట. ఇక విద్యా బాలన్ కూడా అయితే ఇంకా బాగుంటుంది అనేది కొందరి మాట. ఏది ఎలా ఉన్న మహానటి అంటే కీర్తి మాత్రమే...

మరింత సమాచారం తెలుసుకోండి: