యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. 'మహానటి'తో పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్‌ లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ వైజయంతి ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం స్టార్ యాక్టర్స్ ను తీసుకోవాలని చూస్తున్నాడట. ఈ సినిమా జోనర్ ఏమిటనేది మేకర్స్ బయటికి చెప్పకున్నప్పటికీ ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అని సమాచారం. 

 

ఇటీవల నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ వందల కోట్లలో ఉంటుంది అన్నారు. ఇక ఈ సినిమాకు భారీ స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుంది. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకోనున్నారు. అలాగే వివిధ సాంకేతిక విభాగాలకు సంబంధించి హాలీవుడ్ నిపుణులను తీసుకోనున్నారు. ప్రస్తుత పరిస్థితులలో విదేశాల నుండి టెక్నిషియన్స్ తీసుకురావడం కష్టమైనప్పటికీ ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు అన్ని సర్దుకుంటాయని చిత్ర బృందం భావిస్తోందట. అంతేకాకుండా ఈ సినిమా కోసం ప్రభాస్ రెండేళ్లు డేట్స్ కేటాయించనున్నాడట. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిననున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లో అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లి.. 2022 సమ్మర్ కానుకగా విడుదల చేయాలన్నది ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే రాధాకృష్ణ సినిమా తర్వాత ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేది రెండేళ్ల తర్వాతే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: