శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ సాయిపల్లవి, ఆ సినిమాతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అందం, అభినయంతోనే కాదు, తనకు తానే సొంతంగా తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పుకుని ఔరా అనిపించింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని పక్కింటి అమ్మాయిలా కనిపించిన సాయిపల్లవికి ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలో కనిపించలేదు.

 

రానా దగ్గుబాటి హీరోగా విరాట పర్వం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నీది నాది ఒకే కథ ద్వారా ప్రేక్షకులని మెప్పించిన దర్శకుడు వేణు ఊడుగులు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సాయిపల్లవి లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. నక్సలైట్ల కాలంనాటి కథాంశాన్ని తీసుకుని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి సాధారణ పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుందని అర్థం అవుతుంది.

 

ఊరి నడి మధ్యలో అమరవీరుల స్థూపం వద్ద కూర్చుని, చేతిలో చేతిలో పేపరు పెన్ను పట్టుకుని, పక్కన బ్యాగ్ పెట్టుకుని ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. ఇంతవరకూ సాయిపల్లవి ఇలాంటి క్యారెక్టర్ చేయలేదేమో అనిపిస్తుంది. చూడగానే పల్లెటూరి అమ్మాయిలా ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి జానపద గాయనిగా కనిపించనుందని సమాచారం.  ఈ పోస్టర్ తో సినిమా ఎంత నేచురల్ గా ఉండనుందో అర్థం అవుతుంది. 

 

సురేష్ ప్రొడక్షన్స్,  లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నక్సలైట్లు చాలా ఎక్కువగా ఉండేవారు. అప్పట్లో జరిగిన పరిస్థితులని ఇతివృత్తంగా తీసుకుని వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ పూర్తికాగానే షూటింగ్ కి రెడీ అవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: