ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా కొద్దీ సేపటి క్రితం విరాటపర్వం నుండి ఆమె పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్  విడుదలయింది. ఈ ఫస్ట్ లుక్ లో అమర వీరుల స్థూపం దగ్గర  నిరీక్షిస్తూ కూర్చుని కనిపించింది సాయి పల్లవి. ఈ పోస్టర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే  సినిమా ఎంత రియలిస్టిక్ గా తెరకెక్కుతుందో  తెలిసిపోతుంది. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా హీరోగా నటిస్తుండగా మలయాళ నటి  నందితా దాస్ మానవ హక్కుల నేతగా ప్రియమణి  నక్సలైట్ గా కనిపించనున్నారు. సురేష్ బాబు ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల పై సురేష్ బాబు ,చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలకానుంది.
ఇక ఈ సినిమాతో పాటు సాయి పల్లవి  ప్రస్తతం లవ్ స్టోరి లో  కూడా నటిస్తుండగా ఈ రోజు ఉదయం 11:30 గంటలకు ఈ సినిమా నుండి కూడా  ఓ అప్డేట్ రానుంది.  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ  చైతన్య హీరోగా నటిస్తుండగా  పవన్  సంగీతం అందిస్తున్నాడు. ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ చిత్రం జులై లేదా ఆగస్టు లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: