టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ.  సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు పొందారు బాలకృష్ణ.  మాస్ పాత్రలైనా.. క్లాస్ పాత్రలైన.. ఫ్యాక్షన్ రౌద్రం అయినా బాలయ్య ప్రత్యేకతే వేరు అంటారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.  యమదొంగ సినిమాలో యముడి పాత్రలో తాతకు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ముమ్మూర్తులా సీనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉన్న జూ.ఎన్టీఆర్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)మూవీలో నటిస్తున్నారు.

 

ఈ మూవీలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు ఎన్టీఆర్. అయితే రామ్ చరణ్ తో పాటుగా మొట్టమొదటి సారిగా మల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఉగాదికి టైటిల్ రిలీజ్ చేయగా.. రామ్ చరణ్ పుట్టిన రోజుకి చిన్న స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.  ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇంద్రనీల్ ఇటీవల కేజీఎఫ్ తో తన టాలెంట్ ఏంటో నేషనల్ లెవెల్లో చూపించాడు.  ఇప్పుడు ఇదే స్థాయిలో ఎన్టీఆర్ మూవీ వస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండుగే అన్నట్టు. అంతే కాదు  ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా తరహాలో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. 2023 తర్వాత ఈ చిత్రం విడుదల కానుంది. ఈ లెక్కన రాజమౌళి తర్వాత తారక్ ను ఎక్కువ రోజులు డైరెక్ట్ చేసే అవకాశం ప్రశాంత్ నీల్ కు దక్కనుంది. మొత్తానికి నందమూరి కుర్రోడు పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: