ప్రభాస్ అస్సలు తగ్గడం లేదు. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా తన రూట్ లోనే వెళ్తున్నాడు. ఒకసారి ప్రయత్నాలు ఫలించనంత మాత్రాన వెనుకడుగు వెయ్యకూడదన్నట్టు.. మళ్లీ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్నాడట. వరల్డ్ క్లాస్ మూవీతో మ్యాగ్జిమమ్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు ప్రభాస్. 

 

ప్రభాస్ సాహోపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఆడియన్స్ కు వరల్డ్ క్లాస్ మూవీ చూపించాలని ప్రయత్నించాడు. హాలీవుడ్ స్టంట్ కో-ఆర్డినేటర్స్ కెన్నీ బేట్స్, పెంగ్ జాంగ్ లాంటి వాళ్లతో కలిసి సాహోలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ల్లో నటించాడు. అయితే యంగ్ రెబల్ స్టార్ చాలా కష్టపడి చేసిన ఈ స్టంట్స్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా ప్రభాస్ మాత్రం తగ్గడం లేదు. ఆడియన్స్ కు వరల్డ్ క్లాస్ మూవీ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 

 

ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్ లో సైన్స్ ఫిక్షన్ స్టోరీగా రాబోతోంది సినిమా. పాన్ ఇండియన్ మూవీగా 200కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతోన్న ఈ ప్రాజెక్ట్ కు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. 

 

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాదికి రిలీజ్ అయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నాగ్ అశ్విన్ సినిమా స్టార్ట్ చేస్తాడట ప్రభాస్. ఇక సైన్స్ ఫిక్షన్ స్టోరీ కాబట్టి విజువల్ ఎఫెక్ట్ భారీగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రిక్రూట్ చేసుకోవాలనుకుంటోందట యూనిట్. మొత్తానికి ప్రభాస్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకొస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చే సినిమాకు హాలీవుడ్ నిపుణులు పనిచేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఆ మూవీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: