ఇటీవల వరసగా నాలుగు డిజాస్టర్లను చవిచూసిన మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఓ సినిమా ను నా పేరు సూర్య తో డైరెక్ట్ గా మారిన  రచయిత వక్కతం వంశీ తో చేయనున్నాడు. గతంలో రవితేజ కెరీర్ లొనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కిక్ కు కథ ను అందించిన వంశీ ఈసారి డైరెక్టర్ గా రవితేజ కు అలాంటి హిట్ నే ఇవ్వాలని పట్టుదలతో వున్నాడు. అందుకోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని సమాచారం. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  
 
ఇక రవితేజ ప్రస్తుతం క్రాక్ లో నటిస్తున్నాడు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం లో రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తుండగా అతనికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ లో  కనిపించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత రవితేజ ,రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తో సినిమా చేయనున్నాడు. కోలీవుడ్ మూవీ శతురంగ వెట్టై 2 స్ఫూర్తి తో తెరకెక్కనున్న ఈ చిత్రం జులై  నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. రాక్షసుడు నిర్మాతలు  సత్యనారాయణ కోనేరు , హవీష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
ఇక ఈసినిమాలే కాగా  రవితేజ, త్రినాథ రావు నక్కిన తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్రినాథ రావు ,వెంకటేష్ తో చేద్దాం అనుకున్నా కథ ను  రవితేజ కు వినిపించగా  కథ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పాడట. రమేష్ వర్మ తో సినిమా ను పూర్తి చేసిన తరువాత రవితేజ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: