ముందుగా బాలీవుడ్ లో వచ్చిన మున్నా మైఖేల్ సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన యువ భామ నిధి అగర్వాల్, ఆ తరువాత టాలీవుడ్ లో యువ నటుడు నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్ద పరాజయాన్ని మూటగట్టుకుని హీరోయిన్ గా నిధి కి కొంత నిరాశను మిగిల్చింది. ఆ తరువాత మరొక అక్కినేని హీరో అయిన అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమాలో అవకాశం దక్కించుకున్న నిధి, ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఢీలా పడింది. 

 

ఆపై టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన నిధి, ఆ సినిమా అనూహ్యంగా పెద్ద హిట్ కొట్టడంతో తొలిసారిగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో పాటు తమిళ్ లో భూమి, అలానే కన్నడలో జేమ్స్ సినిమాల్లో నటిస్తున్న నిధి, టాలీవుడ్ లోని దాదాపుగా అందరూ హీరోలతో నటించాలనేది తన కల అని చెప్పడం జరిగింది. 

 

ఇక ఎప్పుడూ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ తన సినిమా, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకునే అలవాటున్న నిధి, కొన్నాళ్లుగా కరోనా ఎఫెక్ట్ తో మన దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పలురకాలుగా వంటలు చేస్తూ ఫోటోలు దిగుతూ వాటిని పోస్ట్ చేస్తోంది. ఇకపోతే నిన్న ది వీక్ అనే స్మార్ట్ లైఫ్ మ్యాగజైన్ కోసం ప్రత్యేకంగా లేటెస్ట్ ట్రెండీ స్టైల్ డ్రెస్ తో ఫోటో దిగిన నిధి, ఆ మ్యాగజైన్ కవర్ ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాగా ఆ ఫొటోలో ఆమెను గమనిస్తే గతంలో పవన్ కళ్యాణ్, గుడుంబా శంకర్ లో డబుల్ ప్యాంట్ వేసుకుని ఉన్న మాదిరిగా, ఒకింత వెరైటీ గా జీన్స్ షార్ట్ వేసుకుని ఉండడం, అలానే దాని ఎడ్జెస్ బయటకు కనపడుతుండడంతో, ఇంతకీ నువ్వు ఆ షార్ట్ వేసుకుంటున్నావా, లేక విప్పుతున్నావా తల్లీ అంటూ పలువురు నెటిజన్లు ఆమె డ్రెస్ పై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: