పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లక్షల సంఖ్యలో సినీ అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఎప్పుడైతే సోషల్ మీడియా లో అరంగేట్రం చేసారో.. ఆ క్షణమే లక్షల మంది తన ఐడి ని ఫాలో చేయడం ప్రారంభించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా గురించి ఎన్నో వార్తలు కూడా వెల్లువెత్తాయి. అప్పుడు తన క్రేజ్ ఎలా ఉందో ఇప్పటికీ తన క్రేజ్ అలానే తగ్గిపోకుండా ఉండిపోవడం గమనార్హం. అయితే తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ బర్తడే కి సంబంధించిన వేడుకలను 10 రోజులు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు.


ఈ వేడుకలలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫోటోలను పది రోజుల పాటు సోషల్ మీడియా అంతా నింపేస్తూ ట్రెండ్ చేస్తారు అభిమానులు. ఈ ట్రెండ్ ని ఇతర హీరోల అభిమానులు కూడా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు నిన్నటి నుండి పవర్ స్టార్ కి సంబంధించిన గబ్బర్ సింగ్ ఫోటోలు కామన్ డిస్ప్లే పిక్చర్ (సిడిపి) గా పేర్కొంటూ సోషల్ మీడియాలో తెగ షేర్ షేర్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట దుమారం రేపనున్నాయి.


ఇకపోతే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు ఒప్పుకోక... లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. వకీల్ సాబ్ చిత్రం మే నెలలో విడుదల కావలసిందిగా... కరోనా వల్ల ఇప్పుడు అది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతున్నట్టు సమాచారం అందుతుంది. చిత్రీకరణలో అన్ని వాయిదా పడ్డాయి కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో తన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపించడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: