సూపర్ స్టార్ మహేష్ బాబు తన చిన్న వయసులోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ప్రేక్షకుల ఆదరణను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజకుమారుడు సినిమాతో హీరోగా మరి అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్టైల్ ను ఏర్పరచుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుగా ఎదిగాడు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన " సరిలేరు నీకెవ్వరు " సినిమాతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. ఏ సినిమా తీసిన ఆ సినిమాలో ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా సినిమాలు తీయడానికి ప్రయాతనమ్ చేస్తున్నాడు ప్రిన్స్ మహేష్. అంతే కాకుండా మల్టీస్టారర్ సినిమాలో కూడా మహేష్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఇక ఒకవైపు హీరోగా సినిమాలు ముందుకు వెళుతూనే... మ‌రోవైపు నిర్మాత‌గా వ‌రుస చిత్రాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు మహేష్. అతి త్వరలోనే దర్శకుడు పరుశురాంతో కలిసి కేజీ ప్రాజెక్ట్ చేయబోతున్న మహేష్... మరోవైపు హీరోలు విజయ్ దేవరకొండ, కార్తి వంటి స్టార్ హీరోలతో సినిమాలకు నిర్మాతగా వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతానికి మాత్రం మహేష్ అడివి శేషు హీరోగా చేస్తున్న మేజర్ సినిమా నిర్మాతగా వహిస్తున్నాడు మహేష్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయిపోయింది. ఈ సినిమా అనంతరం మహేష్ విజయ్ దేవరకొండ హీరోగా తీయబోతున్న సినిమాకు నిర్మాతగా వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 


ఇవేకాకుండా ఇప్పటికే విజయ్ దేవరకొండతో చర్చలు కూడా ముగిసాయి అని వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండతో సినిమా పూర్తయిన అనంతరం కార్తీతో కలిసి సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలకు మహేష్ మీడియం బడ్జెట్ తో సినిమాలను నిర్మించబోతున్నారు. అతి త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు సినిమాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని సిని వర్గాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా మహేష్ వివిధ రోల్స్ చేయడం నిజంగా అందించాల్సిన విషయమే...!  

మరింత సమాచారం తెలుసుకోండి: