సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరుశురాంతో తన 27వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. ఈచిత్రం కృష్ణ బర్త్ డే సందర్బంగా  మే 31 న లాంచ్ కానుందని  సమాచారం. అదే రోజు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేసే అవకాశాలు వున్నాయట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను నిర్మించనుండగా గోపి సుందర్ సంగీతం అందించనున్నాడని టాక్. మే 31న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. ఈ సినిమా లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు రాగ పరుశురాం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ఇంకా హీరోయిన్ ను ఎంపిక చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. 2018లో గీత గోవిందంతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాడు పరుశురాం. ఈసినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్  సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ రెండేళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్  పట్టనున్నాడు. 
 
ఇక  భరత్ అనే నేను తో సూపర్ ఫామ్ ను  కొనసాగిస్తున్నాడు మహేష్. ఆ సినిమా తరువాత గత ఏడాది మహర్షి తో హిట్ కొట్టగా సంక్రాంతికి  సరిలేరు నీకెవ్వరు తో వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే  అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా తరువాత మహేష్ ,దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు. 2022 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా సీనియర్ ప్రొడ్యూసర్  కేఎల్ నారాయణ నిర్మించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: