టాలీవుడ్ లో ఇప్పుడు లక్కీ హీరోయిన్ ఎవరు అనగానే చాలా త్వరగా చెప్పే సమాధానం పూజ హెగ్డే. ఈ కన్నడ హీరోయిన్ కి టాలీవుడ్ లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు అనేది వాస్తవం. ఆమె సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ కావడం తో ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేయడం తో ఇప్పుడు ఎక్కువగా కొన్ని వార్తలు హడావుడి చేస్తున్నాయి. మహేష్ బాబు పక్కన చేసిన సినిమా అల్లు అర్జున్ తో చేసిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన సినిమా సహా అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి కూడా. 

 

దీనితో ఈ భామ కు ఇప్పుడు మంచి డిమాండ్ వచ్చింది. అది ఏంటీ అంటే... మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో చేసే సినిమాకు గానూ ఆమెను ఎంపిక చేసారు అని సమాచారం. మహేష్ బాబు ఆమెను స్వయంగా తన తో సినిమా చెయ్యాలని అడిగారు అని అంటున్నారు. అందుకే పూజ మరో ఆలోచన లేకుండా ఆయన తో సినిమా ఓకే చేసింది అని సమాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఈ ప్రచారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ తో సినిమా చేయడానికి ఎందరో స్టార్ హీరోయిన్ లు వస్తారు. 

 

అవసరం అయితే బాలీవుడ్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు ఆమెను ఏ విధంగా అడిగారు ఎందుకు అడిగారు అనేది తెలియడం లేదు. కాగా పరుశురం దర్శకత్వంలో వచ్చే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ సినిమా గురించి అనేక వార్తలు హడావుడి చేస్తున్నాయి. ఈ సినిమా కు నిర్మాత దొరకడం లేదని అందుకే ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: