టాలివుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ హవా నడుస్తుంది. దీని తో బాలివుడ్ హీరోయిన్స్ సైతం టాలివుడ్ వైపు చూస్తున్నారు. ఒక్కో సినిమాకు ఒక్కో హీరోయిన్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు దర్శకులు. అయితే ఒక్క సాయి పల్లవి మాత్రం బుల్లి తెర ద్వారా ఫ్యాన్స్ ని సంపాదించుకుని తర్వాత వెండి తెర పై కాలు పెట్టింది. దీని తో పరిచయం అవసరం లేని పేరు సంపాదించుకుంది. తెలుగులో తన మొదటి సినిమా ఫిదా తో  అచ్చతెలుగు తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులను ఫిదా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన  ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 

సాయి పల్లవి అంటే తెలియని తెలుగు వారుండరు. తన నటన, అందం, డ్యాన్స్ పై మంచి పట్టు ఉండటం వల్ల ఆమె తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన  స్థానాన్ని, క్రేజ్ ని సంపాదించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళ, మళయాళ సినిమాలతో బిజీగా మారింది. దక్షిణాదిన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. రౌడీ బేబీ సాంగ్ ద్వారా అన్ని  వర్గాల ప్రేక్షకులను ఆకర్షించింది. డ్యాన్స్ లో పట్టు ఉండటం వల్ల మాస్ ఫాలోయింగ్ బాగానే సంపాదించింది. 

 

అయితే ఈ అమ్మడికి లౌక్యం గా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో తిరుగు ఉండదు అని సినీ జనాలు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే కెరీర్ మొదటి నుండి కూడా సాయి పల్లవి స్కిన్ షో కి దూరంగా ఉంది. అలాంటి క్యారెక్టర్లు నేను చేయను అని చెపుతుంది. ఇలాంటి కండిషన్స్ వల్లే ఆమె స్టార్ హీరోయిన్ స్థానాన్ని అందుకోలేదని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. అందుకే పెద్ద  సినిమా ఆఫర్స్ సాయి పల్లవి దగ్గరకి రావడం లేదని అందరి ఒపినియన్. ఇప్పుడైనా ఈ అమ్మడు కాస్త లౌక్యంగా ఉంటే నెంబర్ వన్ స్థానానికి తొందరలోనే చేరువవుతుందని ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: