సినీ ఇండస్ట్రీలో బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుందని.. నట వారసులకే సినిమా అవకాశాలు ఇస్తారని.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ఎవ్వరూ పట్టించుకోరనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోని చిత్ర సీమల్లో ఇదే పరిస్థి ఉందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు సినీ తారలు. టాలెంట్‌తో సంబంధం లేకుండా కేవలం స్టార్ కిడ్స్ అనే ఓకే ఒక ఆధారంతో సినిమా అవకాశాలు ఇస్తున్నారని పేర్కొంటూ గతంలో కంగనా రనౌత్, తాప్సీ సైతం విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో కృతి సనన్ చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది. మొదటి సినిమాకే స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'దోచెయ్' చిత్రంలో నటించగా అది కూడా నిరాశపరిచింది. బాలీవుడ్ లో 'హీరోపంటి' 'దిల్ వాలే' 'లూకా చుప్పి' 'బరేలీకి బర్ఫీ' 'పానిపట్' 'హౌస్ ఫుల్ 4' లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ మధ్య అమ్మడికి బాలీవుడ్ అవకాశాలు సన్నగిల్లుతూ వస్తూన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది కృతి.

 

టాలెంట్ ఉన్నా లేకపోయినా సినీ వారసులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు చేసింది. వారికి ఓ సినిమా ఫ్లాప్ అయితే మరో అవకాశం దక్కుతోంది కానీ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్లకు మాత్రం ఒక్క ఫ్లాప్ వస్తే మరో అవకాశం రావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో బంధు ప్రీతి బాగా ఉందని.. అది చాలా తప్పని చెప్పుకొచ్చింది. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా కొందరు సొంతంగా తమ కాళ్లపై నిలబడ్డారని.. కానీ కొందరు మాత్రం బ్యాగ్రౌండ్ ఉన్నా ఫెయిల్ అయ్యారని పేర్కొంది. వారసత్వం అనేది ఎంట్రీ వరకు ఉంటే ఫర్వాలేదు గానీ.. వాళ్ళకే ఛాన్సెస్ ఇస్తూ ఎంకరేజ్ చేయడం సరికాదని కృతి సనన్ అభిప్రాయపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: