టాలీవుడ్ బాద్షా, నందమూరి వంశానికి ముద్దు బిడ్డ జూ. ఎన్టీఆర్ ఆ చిన్న విషయం చేసిన పెద్ద సెన్షేషన్ అవుతుంది. అలాంటిది ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఇంకేముంది ఆ చిన్న విషయం తెలిసిన ఆ విషయాన్ని వారి అభిమానులు పండగల చేసుకుంటారు. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేయబోయే 31 వ మూవీని అనౌన్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్, ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఆ తర్వాత ఇక ఈ రెండు చిత్రాల అనంతరం కేజీఎఫ్ సినిమా ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు విషయాలు తెలుస్తున్నాయి. ఇకపోతే దీనికి సంబంధించిన అన్ని సంప్రదింపులు పూర్తి అయినట్లు టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.
అయితే ఇక ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 న నాడు రానున్నట్లు ఫిలింనగర్ లో పుకార్లు గట్టిగా వినపడుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ను బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందని సమాచారం. ఈ విషయం ఎంత నిజమో కాదో, అంతేకాకుండా ఈ విషయంలో నిజమెంతో మరో 10 రోజుల్లో తేలనుంది. ఇక కేజీఎఫ్ తో ఒక పాన్ సినిమాను తీసి దేశవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈయన యశ్ తోనే కేజీఎఫ్ కు కొనసాగింపుగా కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాను మొదట అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకుందాము అనుకున్న, కానీ లాక్ డౌన్ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల ఇప్పుడు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.