టాలివుడ్ లో ఇప్పుడు హీరోయిన్స్ హవా బాగా నడుస్తుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా కోన సాగుతున్న వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ ని సంపాదించింది. తెలుగు సినిమాలు చేస్తూనే హింది, తమిళ సినిమాల్లో కూడా బిజీగా మారింది ఈ పంజాభి భామ.  అయితే ఈ మధ్య రకుల్ నటించిన సినిమాలు అనుకున్నంత మంచి సక్సెస్ అందుకోలేదు. దీనితో తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పుకోవాలి.

 

టాలీవుడ్ కి కెరటం సినిమా ద్వారా పరిచయమై వెంకటాద్రి సినిమా తో హిట్ అందుకున్న రకుల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత నుండి తన అందం, అభినయం తో వరుస అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోలు అందరితోను నటిస్తూ అదరగొడుతుంది. అందులో భాగంగా లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధ్రువ, పండగ చేస్కో వంటి హిట్ లను సొంతం చేసుకుంది. రకుల్ చివరిగా నటించిన మన్మధుడు 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీనితో ఆమె హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. 

 

లాక్ డౌన్ నేపధ్యంలో ఇంటికే పరిమితమైన రకుల్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. కొత్త కొత్త పొటోలు అప్లోడ్ చేస్తూ, తమ్ముడితో చిన్న నాటి ఆటలను ఆడుతున్న వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేసాయి. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి వినపడుతుంది. దీని గురించి ఆమె తల్లి పెదవి విప్పారు. తనకి ఇష్టమైనప్పుడు, తను ఇష్టపడ్డ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పట్లో రకుల్ కెరీర్ కి ఎటువంటి ఇబ్బంది లేనట్టే అని సినీ వర్గాల కథనం.

మరింత సమాచారం తెలుసుకోండి: