'బాహుబలి' వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం మనకందరికీ తెలిసినదే. దాదాపు ‘సాహో’ సినిమా కోసం ప్రభాస్ రెండు సంవత్సరాల టైం కేటాయించడు. చివరాకరికి సినిమా రిలీజయ్యాక మొట్టమొదటి షోకి అట్టర్ ప్లాప్ టాక్ రావడం జరిగింది. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ స్టోరీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇదిలా ఉండగా ప్రభాస్... డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ లో ఉండబోతోందని సమాచారం. సినిమా నిర్మాత అశ్వినీదత్.. ప్రభాస్ ఇంటర్నేషనల్ ఇమేజ్ కి తగ్గట్టు ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నారట.

 

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి స్టోరీ బయటకు వచ్చింది. అదేమిటంటే ఒక మానవుడు దేవకన్యకి  పుట్టిన పిల్లోడు భూమి మీద ఎలాంటి విన్యాసాలు చెయ్యగలడు భూమి మీద ఆ వ్యక్తి ఎలా జీవిస్తాడు ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తాడు అనే కాన్సెప్ట్ మీద సినిమా స్టోరీని నాగ్ అశ్విన్ రెడీ చేస్తున్నారట. ఈ స్టోరీ లైన్ విన్న ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా గుర్తొస్తుంది.

 

ఒక విధంగా చెప్పాలంటే 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాల్లో చిరంజీవి కి మరియు శ్రీదేవి కి పెళ్లి అయితే పుట్టిన పిల్లవాడు ఎలాంటి విన్యాసాలు భూమిమీద చేస్తాడు అన్న కాన్సెప్ట్ పై సినిమా స్టోరీ నాగ్ అశ్విన్ రెడీ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ సినిమా స్టోరీ ప్రభాస్ హావభావాలకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని అంటున్నారు. దాదాపు ఈ సినిమా కోసం 300 కోట్లకు పైగా అశ్వినీదత్ ఖర్చు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీ నుండి వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: