టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఫిదా’ సినిమా తో హీరోయిన్ సాయి పల్లవి మంచి క్రేజ్ ని సంపాదించింది. అప్పట్లో మలయాళం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేసి చాలామంది ప్రేక్షకులని మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడం జరిగింది. ఆ తరువాత తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్న సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకుంది. ఏలాంటి క్యారెక్టర్ అయినా చేస్తూ రాణిస్తు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది.

 

డాన్సుల పరంగా చూసినా గాని సాయి పల్లవి చాలా స్పీడ్ గా మరియు చూడ తగ్గ విధంగా అచ్చం తెలుగమ్మాయి లాగా ఉట్టి పడేటట్లు ఆడియన్స్ ని తన డాన్స్ తో మైమరుస్తోంది. యూట్యూబ్ లో అయితే ఈమె చేస్తున్న డాన్స్ కి రికార్డులు బద్దలు అవుతున్నాయి. ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎలాంటి భాష అయినా దానిలో పూర్తిగా లీనమై ప్రేక్షకులను ఎంతగానో మైమరిపిస్తుంది. అందరి హీరోయిన్స్ లా కమర్షియల్ సినిమాల వైపు కాకుండా వైవిధ్యమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుని నటనకు మరియు తన కెరియర్ కి ఉపయోగపడేలా పాత్రలు చేస్తూ రాణిస్తోంది.

 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఒకవైపు తెలుగు సినిమాలు చేస్తూనే సౌత్ లో మరికొన్ని భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. యూట్యూబ్ లో మరియు సోషల్ మీడియాలో ఇతర అకౌంట్లలో ఈమె ఫ్యాన్ బేస్ చూసి టాప్ హీరోయిన్లు అనుష్క మరియు సమంత లాంటి వాళ్లు కూడా నోరెళ్ళ పెడుతున్నారట. సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దర్శకుల దృష్టిలో సాయి పల్లవి స్థానం సంపాదించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: