అక్కినేని ఫ్యామిలీ కి చెందిన మూడవ తరం హీరోల్లో ఒకరు అయిన అఖిల్ అక్కినేని ఇప్పటివరకు కెరీర్ పరంగా మొత్తం మూడు సినిమాల్లో హీరోగా నటించడం జరిగింది. వాస్తవానికి తన చిన్నతనంలోనే సిసింద్రీ సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అఖిల్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక అక్కినేని వారి ఫ్యామిలీ మూవీ మనంలో చివర క్లైమాక్స్ లో ఒక సీన్ లో కనపడడడం జరిగింది. ఆ తరువాత పూర్తి స్థాయి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే నటించిన తొలి సినిమానే అఖిల్ కు పూర్తిగా చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

 

అనంతరం వెరైటీ స్క్రీన్ ప్లే సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ తో రెండవ సినిమా హలో లో నటించిన అఖిల్, ఆ సినిమా ద్వారా కేవలం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగారు. ఆ తరువాత యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటించిన మూడవ సినిమా మిస్టర్ మజ్ను మంచి చిత్రంగా నిలిచింది. అయితే మొత్తంగా చెప్పాలంటే మాత్రం, ఇప్పటివరకు అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా అక్కినేని ఫ్యాన్స్ ఆశించే రేంజ్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. ఇక ఆ తరువాత కొంత ఫ్యాప్ తీసుకుని ఎందరో దర్శకుల నుండి కథలు విన్న అఖిల్, చివరకు బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ తో సినిమా చేయడానికి సిద్ధం అయి మొదలెట్టిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ తో పాటు ఒక సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 

 

బొమ్మరిల్లు సినిమా తరువాత ఆరెంజ్, పరుగు సినిమాలు చేసిన భాస్కర్, ఎంతో గ్యాప్ తరువాత చేస్తున్న ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను రాసుకున్నాడట. అందుకే భాస్కర్ చెప్పిన కథ మీద ఉన్న నమ్మకంతోనే అఖిల్ కూడా సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఖచ్చితంగా రేపు షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి, అటు అఖిల్ కు, ఇటు భాస్కర్ కు మంచి బ్రేక్ ని ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. మరి ఇదే కనుక జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కి పండుగే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: