"బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. అలాగే అఖిల్ కి ఈ సినిమా సక్సస్ చాలా కీలకం. అఖిల్ ఇప్పటికే మూడు సినిమాలు చేసినప్పటికి అవన్ని యావరేజ్ గా ఆడాయి తప్ప సూపర్ హిట్ అవలేదు. దాంతో నాగార్జున కూడా ఈ సినిమా విషయం లో చాలా కేర్ తీసుకుంటున్నారట.

 

ఇక ఈ సినిమాని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో "బన్నీ" వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుందట. ఇప్పటికే టైటిల్ తో పాటు పోస్టర్సినిమా మీద బాగా అంచనాలు పెంచేశాయి. ఇక టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియిన్స్ లోను హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం కలుగుతోంది.

 

ఇక చిత్ర యూనిట్ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అని తెలుస్తుంది. ఫస్ట్ టైం అఖిల్ ఖాతాలో ఒక మంచి కమర్షియల్ హిట్ పడబోతుందని ధీమాగా ఉన్నారట. అంతేకాదు అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా... డాన్స్ పరంగా బాగా చేశాడని చెప్పుకుంటున్నారు. అంతేకాదు గీత గోవిందం వంటి క్లాస్ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి సక్సస్ అని అందుకున్నాడో అఖిల్ కూడా అంతటి సక్సస్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి అఖిల్ కి మొదటిసారి ఒక భారీ సక్సస్ రాబోతుందనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: