మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి వరుస బ్లాక్ బస్టర్లతో మహేష్ మంచి జోష్ లో ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు మహేష్ కేరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే దానిపై అనేక వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ కి ముందు తర్వాతి సినిమా వంశీ పైడిపల్లితో ఉంటుందని ఫిక్స్ చేసినప్పటికీ, ఆ తర్వాత వంశీతో సినిమాని క్యాన్సిల్ చేసుకున్నాడు.

 

వంశీ చెప్పిన కథ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ అన్నారు. అయితే ప్రస్తుతానికి పరశురామ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని తేలిపోయింది. ఈ విషయమై మహేష్ నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ పరశురామ్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ మొదటి సారి మహేష్ తో సినిమా చేస్తున్నాడు.

 

అయితే ఈ సినిమా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని సమాచారం. పరశురామ్ గత చిత్రాలని పరిశీలిస్తే అన్నీ క్లాస్ టచ్ ఉన్న చిత్రాలే. ఈ చిత్రంలోనూ క్లాసిక్ లవ్ స్టోరీతో పాటు హీరో ఎలివేషన్స్ బాగానే ఉంటాయట. ఫ్యాన్ మూమెంట్ గా చెప్పబడే డైలాగ్స్ కూడా బాగానే ఉంటాయని సమాచారం. ఇంకా ఈ సినిమాలో మహేష్ ని కాలేజీ కుర్రాడిగా చూడబోతున్నాం అని ప్రచారం జరుగుతోంది.

 

మహర్షి, భరత్ అనే నేను వంటి సినిమాల్లో కనిపించినట్టు కొద్ది సేపు ఈ సినిమాలోనూ కాలేజి కుర్రాడిగా కనిపిస్తాడని మాట్లాడుకుంటున్నారు. మే ౩౧వ తేదీ క్రిష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మహేష్- పరశురామ్ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ మూవీలో నటించబోతున్నట్లు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: