దేశంలో మినహాయింపులు ఇస్తూనే లాక్ డౌన్ మరికొంతకాలం కొనసాగే అవకాశాలు చాలస్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సినిమాలు మాల్స్ పబ్ లు దేవాలయాలు తిరిగి తెరుచుకోవడానికి మాత్రం ఇంకా చాలసమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో షూటింగ్ లు ప్రారంభించాలి అని ప్రయత్నాలు చేస్తున్న ఇండస్ట్రీ రాయబారాలకు మరికొంత కాలం ప్రభుత్వాల నుండి స్పందన రాకపోవచ్చు.


ఇలాంటి పరిస్థితులలో ఈ లాక్ డౌన్ సమయాన్ని అనేకమంది ప్రముఖ దర్శకులు తమ సినిమాల స్క్రిప్ట్ పై మరింత ఫోకస్ పెడుతూ స్క్రిప్ట్ లను ఒకటికి పదిసార్లు మార్పులు చేస్తూ కాలం గడుపుతున్న విషయానికి సంబంధించిన న్యూస్ లీక్ అయింది. ‘ఆచార్య’ మూవీ ఆగిపోయినా ఈసినిమాలో కీలకపాత్రలో కనిపించే రామ్ చరణ్ పాత్ర విషయమై డైలాగ్స్ విషయమై కొరటాల శివ మరింత ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. 


ప్రభాస్ తో ఒక ప్రేమ కథను తీసుతున్న దర్శకుడు రాథా కృష్ణ లాక్ డౌన్ సమయం ముగిసిన తరువాత ప్రభాస్ పూజ హెగ్డే లపై తీయవలసిన ప్రేమ సన్నివేశాలకు సంబంధించిన డైలాగ్స్ కు మళ్ళీ మార్పులు చేస్తున్నట్లు టాక్. ఇక ‘ఆర్ ఆర్ ఆర్’ విషయానికి వస్తే ఈమూవీలో అలియా భట్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా అలియా భట్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చి దిద్ది ‘ఆర్ ఆర్ ఆర్’ కు బాలీవుడ్ లో కూడా మంచి  మార్కెట్ వచ్చేవిధంగా ఈమూవీ పై ఎటువంటి కరోనా నెగిటివ్ బిజినెస్ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


‘వకీల్ సాబ్’ కు సంబంధించి సినిమా షూటింగ్ లు మొదలైతే చాలు ఎంతవేగంగా ఆసినిమాను పూర్తిచేయాలి అన్న టైమ్ షెడ్యూల్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ఒకటికి రెండుసార్లు యాక్షన్ ప్లాన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ సుకుమార్ లు తాము జూనియర్ అల్లు అర్జున్ లతో తీయబోతున్న సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో తెలియకపోయినా ఈమూవీలకు సంబంధించిన స్క్రీన్ ప్లేలో మరింత పట్టు ఉండేలా రకరకాల మార్పులు చేస్తూ వీరిద్దరు కూడ ఈలాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా టాప్ దర్శకులు అంతా టాప్ హీరోల గురించి వారి సినిమాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటే టాప్ హీరోలు మాత్రం తమకు ఉన్న టెన్షన్ బయటపడకుండా వారి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న రకరకాల వీడియోలను ఫోటోలను షేర్ చేస్తూ లాక్ డౌన్ సమయంలో కూడ అలవాటు పోకుండా బాగా నటిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: