టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించిన దేవరకొండ.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే హిట్‌ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిందం'తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు వరుసగా ప్లాపులు రావడంతో కొంచెం వెనుకబడిపోయాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫైటర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌ లో తొలి ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమాని కరణ్ జోహార్ - ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకున్న 'ఫైటర్' ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. 'డియ‌ర్ కామ్రేడ్‌' 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' సినిమాలు దెబ్బ తిన‌డంతో 'ఫైటర్'పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. 

 

కాగా గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ రెండు సినిమాలను లైన్లో పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. వాటిలో శివ నిర్వాణా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మరో మూవీ చేయబోతున్నట్లు న్యూస్ వచ్చింది. కానీ అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. నిన్న హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజును పురస్కరించుకొని టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వారిలో దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కూడా ఉన్నారు. ''ఈ ఏడాది నీ నుండి మంచి మూవీ ఇంకా రావాల్సివుంది. నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా విజయ్ దేవరకొండ ‘కృతజ్ఞతలు.. అయితే ఆ అద్భుతం మనమిద్దరం కలిసి చేయబోతున్నాం’ అని ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ ట్వీట్.. వీరిద్దరూ త్వరలో సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెవుతుంది అనిపిస్తుంది. మోహన కృష్ణ ప్రస్తుతం సుదీర్ బాబు - నాని కాంబోలో 'వి' మూవీ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వి విడుదలకు సిద్ధంగా ఉంది. ఉగాది కానుకగా విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: