కొత్త బంగారు లోకం సినిమాతో హిట్ అందుకున్న డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడు. కొన్నాళ్లుగా తెలుగులో మల్టీస్టారర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఆ సినిమా చాలా నచ్చేసింది. ఇక ఆ సినిమా పనిచేస్తున్న టైం లో శ్రీకాంత్ వర్క్ నచ్చిన సూపర్ స్టార్ మహేష్ మరో ఛాన్స్ ఇచ్చాడు. అయితే బ్రహ్మోత్సవం అని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. 

 

డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ మంచిదే కానీ దాన్ని సరిగా తెరకెక్కించలేదు. అందుకే మహేష్ కెరియర్ లో బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా మిలిగింది. ఇక ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ శ్రీకాంత్ కు ఒక ఛాన్స్ ఇస్తున్నాడని వార్తలు వచ్చాయి. కూచిపూడి వారి వీధి అంటూ సినిమా టైటిల్ కూడా బయటకు వచ్చింది. ఐతే సినిమాసినిమా పక్కన పెట్టేసి ప్రస్తుతం వెంకటేష్ తో నారప్ప సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. 

 

తమిళంలో సూపర్ హిట్ అయినా అసురన్ కు అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత కూచిపూడి వారి వీధి సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. జాను తర్వాత శ్రీకారం సినిమాతో వస్తున్నా శర్వానంద్ అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు. నారప్ప హిట్ అయితే శ్రీకాంత్ సినిమాను కూడా ముందుగానే చేసేలా ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల.                 

 

మరింత సమాచారం తెలుసుకోండి: