టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అడుగుపెట్టిన మహేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో కమర్షియల్ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయిన “సరిలేరు నీకెవ్వరు” మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే మరొక సినిమా స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు. కాని కరోన కారణంగా లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. 

 

మహేష్ తన 27 వ సినిమాని పరశురాం తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కి తన సినిమాల గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం అలవాటు. అయితే ఈ సారి తన 27 వ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారట. కాని లాక్ డౌన్ పొడిగించటం వల్ల అది సాధ్యపడేలా లేదు. అయితే ఈ సారి మహేష్ అభిమానుల కోసం ఫ్యామిలి ఎంటర్ టైనర్ ని పరశురాం  సిద్దం చేసినట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతుంది. అయితే పరశురాం ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా మారబోతున్నట్టు వెల్లడించారు. 

 

క్లాస్, మాస్ అభిమానులు అందరు కోరుకునే విధంగా సూపర్ స్టార్ ఎలివేషన్ సీన్స్, రోమాన్టిక్ సీన్స్  అధికంగా ఉంటాయని  చెప్పు కొచ్చారు. గీత గోవిందం తో మంచి హిట్ అందుకున్న పరశురాం  సూపర్ స్టార్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంబి ప్రొడక్షన్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. మే 31 నాటికి ఈ సినిమాకి సంబంధిన వార్తలు ఇంకా ఏమన్నా బయటకు వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: