ఈ మద్య సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ తో సినీ పరిశ్రమ ముసి వేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇప్పుడు వరుస విషాదాలు హృదయాలను కలచి వేస్తున్నాయి. బాలీవుడ్ లో ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం జీర్ణించుకోక ముందే అలనాటి అందగాడు బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ ముంబాయి ఆసుపత్రిలోకన్నుమూశారు. ఆ తర్వాత వరుసగా నిర్మాత, ఫోటో గ్రాఫర్, దర్శకులు కన్ను మూసిన విషయం తెలిసిందే. మలయాళ చిత్ర నిర్మాత జిబిత్ జార్జ్ భారీ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. మాలీవుబ్ లో యువ నటుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంఘటన మర్చిపోకముందే మరో మాలీవుడ్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ జయేశ్(44) కన్నుమూశారు. ఏడాది నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన అనారోగ్యం కారణంగా ఆదివారం కేరళలోని కోడాకర శాంతి ఆసుపత్రిలో చేరారు.
చివరి వరకూ మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం ప్రాణాలు విడిచాడు. ఆయన మరణంతో మలయాళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కేరళలోని త్రిస్సూర్కు చెందిన గోపీ మీనన్, ఆరికట్టు గౌరీ దంపతులకు జయేశ్ జన్మించారు. అతను సునాజా అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించారు. రెండేళ్ల క్రితం అతని కుమారుడి మరణించగా ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కళాభవన్ జయేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కేరళలోని త్రిస్సూర్కు చెందిన గోపీ మీనన్, ఆరికట్టు గౌరీ దంపతులకు జయేశ్ జన్మించారు. అతను సునాజా అనే మహిళను వివాహం చేసుకోగా వీరికి ఓ బాబు జన్మించారు. రెండేళ్ల క్రితం అతని కుమారుడి మరణించగా ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఓ వైపు కరోనా కష్టాలు మరోవైను సినీ విషాదాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.