టాలీవుడ్ లో టాప్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయన ఏ సినిమా చేసిన అది ప్రేక్షకులకు బాగా చేరువవుతుంది అనేది చాలా మంది డైరెక్టర్ లు, నిర్మాతల అభిప్రాయం. దీనికి బన్ని సినిమాలన్నీ బారి విజయాలను అందుకోవడమే కారణం. ఈ మధ్య వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత బన్ని మరొక సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంభి నేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం వంటి హిట్ సినిమా తర్వాత సుకుమార్ చేస్తున్న మొదటి సినిమా పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన  నటిస్తున్నారు. వీరి కాంభో లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం తో అందరి దృష్టి ఈ సినిమాపైనే. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత షెడ్యుల్ కోసం కేరళ వెళ్ళాల్సి ఉంది. 

 

అయితే లాక్ డౌన్ నేపధ్యంలో షూటింగ్ వాయిదా పడింది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఉన్న ఈ సినిమాలో బన్ని రాయలసీమ యాసలో ఊర  మాస్, మొరటు మనిషిలా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలోని పాత్రలు మన నేటివిటి ప్రతిబింబించేలా లోకల్ గానే షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ భావించారట. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఖర్చుతో మన దేశంలోనే 100% షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: