తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎందరో యువ హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో వారసుల హవా నడుస్తుందని చెప్పాలి. హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలా అందరు తమ వారసులను లేదా సన్నిహితులనూ వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుండి దాదాపు డజను మంది వెండి తెరకు పరిచయ మైయ్యారు. వారిలో సాయి ధరం తేజ్  ఒకరు. మెగా స్టార్ మేనల్లుడు అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. 

 

“రేయ్” సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సాయి ధరం తేజ్ కెరీర్ మొదట్లో వరుస విజయాలతో అగ్ర హీరోల జాబితాలో స్థానం సంపాదించాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తర్వాత దాదాపు అర డజను సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. అయితే హిట్, ప్లాప్ తో సంబందం లేకుండా వరుస సినిమాలతో తన మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు తేజ్. ఈ నేపధ్యంలో చిత్ర లహరి, ప్రతి రోజు పండగే సినిమాలతో ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ “సోలో లైఫే సో బెటర్” సినిమా చేస్తున్నాడు. 

 

సుబ్బు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ని ఎంపిక చేసారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ వేసవి కి దీనిని  రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ అనుకున్నారట. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా తర్వాత దేవకట్టా దర్శకత్వంలో “ప్రస్థానం” సినిమా కూడా ఓకే చేసినట్టు సమాచారం. ప్రస్థానం సినిమా నటుడిగా తేజ్ కెరీర్ కి మరింత గుర్తింపు తెస్తుందని దేవకట్టా వెల్లడించారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాలు రెండు తేజ్ కి ఎలా కలిసి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: