టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల హవా సాగుతుంది. అగ్ర హీరోలందరూ  మల్టీ స్టారర్ సినిమాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు.  ఈ నేపధ్యంలో ప్రముఖ దర్శక, నిర్మాతలు కూడా ఈ విధమైన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. అయితే అలా చేసిన సినిమాలతో అన్ని వర్గాల అభిమానులను మెప్పించాలంటే  అసాధారణమైన విషయం అనే చెప్పాలి. కాని రాజ మౌళి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్ర నిర్మాణం చేపడతారని సినీ వర్గాల టాక్. 

 

గతంలో బాహుబలి సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో రానా, ప్రభాస్ లు నటించగా వారి ఇద్దరి అభిమానుల మన్ననలు అందుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఎన్టిఆర్, రాం చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీరిద్దరితో పాటు ఇతర దేశాలకు చెందిన తారలు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన అజయ్ దేవగణ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారని రాజ మౌళి ఒక ఇంటర్వ్యులో వెల్లడించారు.  ఈ సినిమాలో అజయ్ పాత్ర సినిమా బ్రేక్ పాయింట్ సమయంలో అజయ్ పాత్ర భారీ ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. 

 

అయితే సినీ వర్గాల కథనం ప్రకారం అజయ్  ఒక ఫ్రీడం ఫైటర్ పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఎన్టిఆర్ కొమరం భీం గా, రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారు. అజయ్ పాత్ర వల్లే ఎన్టిఆర్, రాం చరణ్ పాత్రలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటాయని సినీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి అజయ్ పాత్ర ప్రేరణాత్మకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ఐర్లాండ్ కి చెందిన నటుడు రే స్టీవెన్ సన్ ను, ఐరిష్ కి చెందిన మరొక నటి అలిసన్ డుడి ని ఎంపిక చేసారు. ఎన్టిఆర్ కి హీరోయిన్  ఒలివియా మోరీస్ ను తీసుకున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: