టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన నిర్మాతల్లో ప్రత్యేకంగా చెప్పుకునే నిర్మాత అశ్విని దత్. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు ఆయన చేసిన ప్రయోగాలు ఏ ఒక్క నిర్మాత కూడా చేసే వారు కాదు అని టాలీవుడ్ లో ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. టాలీవుడ్ లో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని అతని తక్కువ కాలంలో సంపాదించుకున్నారు ఆయన తో ఏ హీరో సినిమా చేసినా సరే హిట్ అవుతుంది అనే భావన లో ఉండే వారు అప్పట్లో. ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు కెరీర్ లో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నారు. 

 

కాని మహానటి సినిమా తర్వాత మాత్రం ఆయన ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేశారు. మహానటి సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది అనేది వాస్తవం. వరుస ఫ్లాపుల నుంచి ఆయన బయటపడ్డారు ఆ సినిమా ద్వారా. ఇక ఇప్పుడు ఆయన ప్రభాస్ తో ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా దర్శకుడు మహానటి దర్శకుడు ఒకరే. అతని మీద నమ్మకం తో ఈ సినిమాకు భారీగా పెట్టుబడి పెట్టడానికి ఆయన ఆస్తులు కూడా మ్మారు అని అంటున్నారు. 

 

ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి గానూ అతని ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది అని ఆయన భావిస్తున్నారు. మహానటి సినిమా ద్వారా అతను కీర్తి సురేష్ ని మలిచిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు ప్రభాస్ తో చేసే సినిమాకు కూడా ఇలాగే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నాగ్ అశ్విన్ కూడా పైకి వచ్చే సూచనలు ఉన్నాయి అనేది టాలీవుడ్ వర్గాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: