తెలుగులో ఇప్పుడు ఎటు నుంచి ఎటు చూసినా సరే కనపడేది ఇద్దరే హీరోయిన్ లు. వీళ్ళు మినహా మరో హీరోయిన్ ని ఏ విధంగా చూసినా సరే కనపడటం లేదు. పూజ హెగ్డే, రష్మిక మందన మినహా ఎవరికి ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు కనపడటం లేదు అనే చెప్పాలి. ఈ తరుణంలో ఇప్పుడు టాలీవుడ్ లో మరో స్టార్ హీరోయిన్ ని తీసుకుని రావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అవ్వాలి గాని తీసుకుని రావడం ఏంటీ అంటారా అవును... ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ కోసం టాలీవుడ్ జనాలు గాలం వేసారు. 

 

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి ని టాలీవుడ్ లో తీసుకుని రావడానికి ఆలోచనలో పడ్డారు దర్శక నిర్మాతలు. ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చి అన్ని కమర్షియల్ సినిమాల్లో నటించే విధంగా చూడాలి అని, ఆమె సినిమా చేస్తే కోహ్లీ ఫాన్స్ కూడా సినిమాను చూసే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు.  మన తెలుగులో కోహ్లీ కి కూడా ఫాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఆమె సినిమాకు అతను ప్రచారం చేయకపోయినా సరే కొందరు సినిమా చూడటం దాదాపుగా ఖాయం  అనే చెప్పవచ్చు. 

 

అందుకే ఇప్పుడు అనుష్క శర్మ కోసం టాలీవుడ్ జనాలు గాలం వేసారని టాలీవుడ్ లో పెద్ద చర్చే నడుస్తుంది. మరి తీసుకుంటారా లేదా ఆమె వస్తుందా లేదా అనేది చూడాలి. ఆమె వస్తే ఎంత అడుగుతుంది అనేది కూడా చెప్పడం చాలా వరకు కష్టమే. ఎందుకంటే ఆమె అక్కడ స్టార్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇక్కడికి వచ్చి ఆమె సినిమా చేస్తే చాలా వరకు ఇచ్చుకోవాలి. అందుకే ఆమె విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: