టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రష్మిక మందాన‌ హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సినిమాల త‌ర్వాత ఆమెకు ఇప్పుడు వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సుల మీద ఛాన్సులు వ‌స్తున్నాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ర‌ష్మిక‌కు ఏకంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న ఛాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 

 

రష్మిక సినిమాల మీద ఫోకస్ చేయడమే కాకుండా ఇతర వ్యవహారాల మీద కూడా ఈ మధ్య కాలంలో ఫోకస్ చేస్తుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సినిమాలతో పాటుగా వ్యాపారం మీద కూడా ఫోకస్ చేసింది. అంటే నిర్మాత గా మారాలని ఆమె భావిస్తుంది అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ మేరకు ఆమె చిన్న దర్శకులను.. యువ దర్శకులను కథలను కూడా అడిగింది అని సమాచారం. ఇక ఇప్పుడు ఆమె ఒక మీడియం రేంజ్‌ హీరోతో పాటు కొత్త హీరోయిన్ ను పెట్టి బోల్డ్ క‌థాంశం ఉన్న సినిమాను  తీయాల ని ప్లాన్లు వేస్తోంద‌ట‌.

 

అమ్మాయి ల‌వ్ లో ఫెయిల్ అయిన లవ్ స్టోరీ ఆధారంగా ఆమె సినిమా చేయడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది సష్టత లేదు.. కాని ఆమె మాత్రం ఆ బోల్డ్ స్టోరీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక ఆ అమ్మాయి తో ఇప్పటికే మాట్లాడి కథను కూడా వినిపించింది అని సమాచారం. 

 

కథ విన్న ఆ అమ్మాయి ముందు చేయడానికి భయపడినా సరే ఆ తర్వాత మాత్రం ఓకే చెప్పింది అని టాక్. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో రష్మిక ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ర‌ష్మిక తొంద‌ర చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: