బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు భాస్కర్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందించిన ఈ సినిమా టాలీవుడ్ లో రికార్డుల మోత మోగించింది. అంతేకాదు హీరో సిద్దార్థ్, జెనీలియా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పరుగు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సస్ ని దక్కించుకుంది. అల్లు అర్జున్ ని చాలా కొత్తగా చూపించాడు భాస్కర్. దాంతో టాలీవుడ్ లో హీరోలు, నిర్మాతలందరి దృష్ఠి భాస్కర్ మీద పడింది. మంచి క్రేజ్ ని దక్కించుకున్న భాస్కర్ కి మరో క్రేజీ ప్రాజెక్ట్ చేతికి వచ్చింది.

 

అదే ఆరెంజ్. ఈ సినిమా కి మెగా బ్రదర్ నాగ బాబు ప్రొడ్యూసర్ కాగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా తెరకెక్కించాడు భాస్కర్. హీరోయిన్ గా జెనీలియా నటించింది. సినిమా కి ఫ్యాన్స్ నుంచి, ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి ఫ్లాప్ గా మిగిలింది. దాంతో భాస్కర్ కి వచ్చిన పేరు, క్రేజ్ మొత్తం పడిపోయింది. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా పెద్ద ప్లస్ అన్న వాల్లే ఆరెంజ్ సినిమాకి పెద్ద మైనస్ అన్నారు. ఈ సినిమా భాస్కర్ తో పాటు నాగ బాబు ని కష్టాల్లో పడేసింది. ఆ తర్వాత భాస్కర్ తీసిన ఒంగోలు గిత్త డిజాస్టర్ గా మిలిగిలింది. అంతే మళ్ళీ భాస్కర్ నుండి ఏ సినిమా రాలేదు.

 

అయితే ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియోట్ అయింది. అంతేకాదు హిట్ గ్యారెంటీ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అయ్యో అవకాశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత భాస్కర్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ రావచ్చని అంటున్నారు. మొత్తానికి భాస్కర్ మళ్ళీ ఫాం లోకి వచ్చినట్టే.  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: