యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు అటు దర్శకుడు పూరి కి, ఇటు హీరో రామ్ కి కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేదు అనే చెప్పాలి. ఒక్కసారిగా రిలీజ్ తరువాత ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో వారిద్దరికి బ్రేక్ లభించింది. 

 

మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా పలు యాక్షన్ సీన్స్, పవర్ఫుల్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పూరి మార్క్ టేకింగ్, హీరోయిన్లయి ఇద్దరి అందాలు సినిమాని మంచి సక్సెస్ చేసేలా చేసాయి. అటు యువత తో పాటు ఇటు మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఎంతో బ్రహ్మరథం పట్టారు. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో పార్ట్ 2 తీయనున్నట్లు అప్పట్లో పూరి ప్రకటించారు. అయితే అదే సమయంలో విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ మూవీ ని అనౌన్స్ చేసిన పూరి, దాని అనంతరం డబుల్ ఇస్మార్ట్ తీస్తానని చెప్పడం జరిగింది. ఇక ఇటీవల విజయ్ దేవరకొండతో మొదలైన పూరి సినిమా ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్. ప్రస్తుతం కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా వ్యాధి వలన లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఆ సినిమా షూట్ కూడా ఆగిపోయింది. 

 

అయితే లాక్ డౌన్ ముగిసిన అనంతరం వీలైనంత త్వరగా దాని బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేస్తాం అని పూరి ఇటీవల చెప్పడం జరిగింది. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, సరిగ్గా దసరా సమయానికి పూరి, విజయ్సినిమా థియేటర్స్ లో ఉండే అవకాశం ఉందని, లేదంటే జనవరికి వాయిదా పడుతుందని అంటున్నారు. అయితే ఒకవేళ ఆ సినిమా జనవరికి వాయిదా పడినట్లైతే ఈలోపే డబుల్ ఇస్మార్ట్ ని పట్టాలెక్కించేందుకు పూరి సిద్ధం అవుతున్నట్లు టాక్. ఇదే కనుక నిజం అయితే, ఒకరకంగా ఇది రామ్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త ఎన్ని చెప్పక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: