సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఒకదాని వెంట మరొకటి పూర్తి అవుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం పూర్తి కథ, స్క్రిప్ట్ సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించి పలు ఇతర పాత్రల్లో నటించే నటీనటులను కూడా ఎంపిక చేయడం పూర్తి చేశాడట దర్శకుడు పరుశురాం. మరోవైపు సంగీత దర్శకుడు విషయమే కొంత తర్జనభర్జన జరుగుతోందని, గోపీసుందర్, తమన్, మణిశర్మ లలో ఎవరో ఒకరు ఈ సినిమాకు ఎంపికయ్యే ఛాన్స్ ఉందని గట్టిగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు అనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. 

 

కొన్నాళ్ల క్రితం ముందుగా శృతిహాసన్, ఆపై కీర్తి సురేష్, కియారా అద్వానీ, ఆలియా భట్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక ఆరుగురు హీరోయిన్ ల వరకు పేర్లు మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఎక్కువ శాతం మాత్రం ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యే అవకాశం కీర్తి సురేష్ కు ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా విషయమై దర్శకుడు పరశురామ్ ఇటీవల కీర్తిని సంప్రదించటం, అలానే ఆమె కూడా కథ విని సినిమా చేయడానికి ఒప్పుకోవడం కూడా జరిగిందని టాక్. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి, వాటిలో రెండింటి షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిందని, అతి త్వరలో మిగతా రెండింటినీ కూడా పూర్తిచేసి, ఆపై మహేష్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుందని అంటున్నారు. 

 

మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్, తమ హీరో పక్కన కీర్తి సురేష్ నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఒక సినిమాలో మహేష్ సరసన కీర్తి నటించాల్సి ఉండగా, అనుకోకుండా ఛాన్స్ మిస్ అయిందని, తప్పకుండా ఈ సినిమా ద్వారా ఆమె మహేష్ తో జతకట్టడం ఖాయం అని వారు అంటున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా కీర్తికి తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, ప్లీజ్ మేడమ్, మీరు మా సూపర్ స్టార్ తో ఒక సినిమా చేయండి, మీ జోడి స్క్రీన్ పై ఎంతో బాగుంటుంది అంటూ ఆమెను కోరుతూ మెసేజస్ కూడా చేస్తున్నారట. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇంతగా ఆశపడుతున్న విధంగా, మహేష్ బాబు కీర్తి సురేష్ ల జోడి ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి.....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: